ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్తో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డి నేరుగా బండ్ల గణేష్ ఇంటికి వెళ్లి రెండు గంటల పటు చర్చించారు. బండ్ల గణేష్ను మళ్లీ రాజకీయాల్లోకి రావాలని రేవంత్ సూచించారు. పలు సందర్భాల్లో కాంగ్రెస్ ఎన్నికల సమయంలో పార్టీలో యాక్టివ్గా కనిపించిన బండ్ల గణేష్ గత కొంతకాలంగా రాజీకీయాలకు అయన దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయనతో రేవంత్ రెడ్డి భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.