హైదరాబాద్లోని అబిడ్స్ అరోరా కళాశాలలో సాంకేతిక సమస్యల కారణంగా శుక్రవారం జరిగిన జేఈఈ రెండో సెషన్ను నిర్వహించలేకపోయారు. తిరిగి పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాన్ని ఎన్టీఏ వెబ్సైట్లో పరిశీలించాలని కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ తెలిపారు. దీంతో మధ్యాహ్నం 3 గంటలకు రెండో సెషన్కు వచ్చిన విద్యార్థులు సాయంత్రం వరకు వేచి చూసి నిరాశతో వెనుదిరిగారు.