ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంచతంత్ర పార్క్ ను ప్రారంభించిన మంత్రి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 23, 2022, 02:28 PM

ఖమ్మం నగరంలోని 10వ డివిజన్ చైతన్య నగర్ లో రూ. 25 లక్షలతో నిర్మించిన పంచతంత్ర పార్క్ ను శుక్రవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం చైతన్య నగర్ లో రూ. 45 లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రెయిన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఖమ్మం నగరాన్ని అభివృద్ధి పథంలో తన లక్ష్యమన్నారు. ఇప్పటికే నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, డీసీసీబీ చైర్మన్ నాగభూషణం, మేయర్ పునుకొల్లు నీరజ, ఏఎంసీ చైర్మన్ లక్ష్మిప్రసన్న, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్లు, జిల్లా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com