మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటరీ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కీసర మండలంలోని బోగారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ వార్డు సభ్యులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు మంత్రి మల్లారెడ్డి రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకోవడానికి పార్టీలో చేరినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి అధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరడం పై హర్షం వ్యక్తం చేస్తూ వారిని పార్టీలోకి కండువా కప్పి స్వాగతించారు.