తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కంటతడి పెట్టించే ఘటన జరిగింది. ఇల్లందు మండలం బాలాజీ నగర్కు చెందిన గడ్డం లక్ష్మయ్య, లక్ష్మి దంపతులు కూలి పని చేసుకుంటుంటారు. వృద్ధాప్యంలోనూ వారు పైసాపైసా కూడబెట్టుకుని పెట్టెలో దాచుకున్నారు. ఇటీవల పెట్టె తెరవగా డబ్బు చెదలు పట్టి కనిపించింది. బ్యాంకులు చుట్టూ తిరిగినా వారు పట్టించుకోవడం లేదు. తమ కష్టార్జితం ఇలా అయిపోయిందని వారు రోదిస్తున్నారు.