ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (సీయూఈటీ)-యూజీ ఫలితాలను ఎన్టీఏ సోమవారం సాయంత్రం విడుదల చేసింది. సెప్టెంబర్ 1-12 వరకు పలు విడతలుగా నిర్వహించిన ఈ పరీక్షకు దాదాపు 3.34లక్షల మంది హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 27 కేంద్రీయ విశ్వవిద్యాలయాలతో పాటు మొత్తం 66 వర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహించారు. విద్యార్థులు తమ ఫలితాలను https://cuet.nta.nic.in/ వెబ్ సైట్ లో చూసుకోవచ్చు.