వరంగల్ జిల్లా ఖానాపురం మండలం లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఖానాపురం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం రోజు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
రైతులు తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి అవకతవకలు లేకుండా సరైన కాంట ద్వారా రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించాలని రైతులు కూడా నిర్ణీత సమయం లోపల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. రైతులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా కేంద్రాల వద్ద అన్ని రకాల వసతులను ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఓడిసియంఎస్ చైర్మన్, ఎంపిపి, జెడ్పిటిసి, మండల పార్టీ అధ్యక్షులు, రైతు సమన్వయ సమితి కన్వీనర్, ఎంపిటిసిలు, సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.