గణతంత్ర దినోత్సవం నిర్వహించేందుకు కూడా హైకోర్టును ఆశ్రయించాల్సిన దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యల వల్ల దేశ వ్యాప్తంగా తెలంగాణ పరువు పోతుందన్నారు. ఎవరు అధికారంలో ఉన్నా రాజ్యాంగ నిబంధనలను పాటించాలన్నారు. రాజ్యాంగేతర శక్తులకు రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. దేశంలో చాలాసార్లు గవర్నర్లు, ముఖ్యమంత్రులకు భిన్నాభిప్రాయాలు వచ్చినా... కేసీఆర్ మాదిరి ఎవరు దిగజారుడు రాజకీయాలు ఎవరూ చేయలేదన్నారు. తెలంగాణలో చాలా విచిత్రమైన రాజకీయాలు జరుగుతున్నాయన్నారు.