ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇప్పటికే మూడు పెళ్లిళ్లు,,,ముచ్చటగా నాలుగో పె‌ళ్లికి రెఢీ అయిన నిత్య పెళ్లి కొడుకు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 30, 2023, 05:41 PM

కొందరికి పెళిళ్లు ఓ క్రీడాగా మారుతున్నాయి. ఈ  క్రమంలోనే హైదరాబాద్ బోయిన్‌పల్లిలో నిత్య పెళ్లికొడుకు బండారం బట్టబయలైంది. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసిన అతడు.. నాలుగో పెళ్లికి సిద్ధమయ్యాడు. మూడో భార్య పోలీసులకు ఫిర్యాదు చేయటంతో నిత్య పెళ్లి కొడుకు బాగోతం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన వంశీ కృష్ణ ఓ ప్రముఖ కంపెనీలో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ.. కుటుంబ సభ్యులతో కలిసి దిల్‌సుఖ్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు.


వంశీకృష్ణకు గంతలోనే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. అయితే వివిధ కారణాలతో మెుదటి ఇద్దరి భార్యలకు విడాకులు ఇచ్చాడు. అనంతరం మూడో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో తన వివరాలు ఓ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో నమోదు చేశాడు. నెల్లూరుకు చెందిన మీనారెడ్డి అనే యువతి వైద్యురాలిగా పని చేస్తున్నారు. ఆమెకు గతేడాది వివాహం జరగ్గా.. ఇటీవల భర్త చనిపోయాడు. దీంతో ఆమె కూడా మరో పెళ్లి కోసం మ్యాట్రిమోనీ సైట్‌లో తన వివరాలను నమోదు చేసుకుంది.


మ్యాట్రిమోనీ సైడ్ ద్వారా ఒకరి వివరాలు మరొకరికి అందటంతో గత నెలలో వంశీకృష్ణ నెల్లూరుకు వెళ్లి డాక్టర్ మీనారెడ్డిన కలిశాడు. నాలుగు రోజుల పాటు నెల్లూరులోనే ఉండి.. హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు. అనంతరం మీనారెడ్డి, వంశీకృష్ణలకు ఒకరికి ఒకరు నచ్చటంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈనెల 4న ఇరు కుటంబాల సమక్షంలో ఎలాంటి ఆర్భాటం లేకుండా పెళ్లి చేసుకున్నారు. వారం రోజుల తర్వాత నెల్లూరుకు వెళ్లిన మీనారెడ్డి.. ఈనెల 24న తిరిగి హైదరాబాద్ వచ్చింది.


ఏం జరిగిందో తెలియదు కానీ.. తనకు మీనా రెడ్డి అంటే ఇష్టం లేదని వంశీకృష్ణ కుటుబం సభ్యులకు చెప్పాడు. అనంతరం ఆమెను తన ఇంట్లోనే ఓ గదిలో బంధించాడు. మరో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అందుకోసం మళ్లీ మ్యాట్రిమోనీ సైట్‌ను సంప్రదించాడు. ఇటీవలే పెళ్లి చేసుకున్న వంశీకృష్ణ మళ్లీ పెళ్లి కోసం దరఖాస్తు చేసుకోవటంతో మ్యాట్రిమోనీ నిర్వాహకులకు అనుమానం వచ్చింది.


వెంటనే మ్యాట్రిమోనీ నిర్వాహకులు మీనా రెడ్డికి ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో ఖంగుతిన్న మీనారెడ్డి వంశీకృష్ణ ఇంటి నుంచి తప్పించుకుంది. అనంతరం బోయిన్‌పల్లి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిత్య పెళ్లి కొడుకు వంశీ కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. మూడు పెళ్లిళ్ల వ్యవహారంలో అతని కుటుంబ సభ్యుల పాత్ర ఉందా ? అన్న కోణంలో విచారణ చేపట్టారు.











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com