ముస్తాబాద్ మండలం మోరయిపల్లి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి ఎంపీపీ జనగామ శరత్రావ్, జడ్పిటిసి గుండం నరసయ్య, సర్పంచ్ సదిమెల సుజాత తో కలిసి మంగళవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గూడులేని నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించడం హర్షనీయమని కొనియాడారు. కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఉపసర్పంచ్ శ్రీనివాస్ డిఆర్ఎస్ మండల అధ్యక్షులు సురేందర్, బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.