భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్, అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కలిసి సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్ మాట్లాడుతూ, క్రిమినల్ కేసుల వివరాలు, కేసుల్లోని సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టే విధానము, వారెంట్ల పెండింగు విధానం గురించి పోలీసు అధికారులతో పోలీస్ స్టేషన్ల వారీగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు జి. భానుమతి, ఆడెపు నీరజ, బత్తుల రామారావు, పబ్లిక్ ఫస్ట్ రూటర్ పోసాని రాధాకృష్ణమూర్తి, అదనపు పబ్లిక్ ప్రోసీస్క్యూటర్స్ పీవీడి లక్ష్మి , మీర్జా ఫీరోజ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ ఎస్. జానయ్య, డిఎస్పి జి. వెంకటేశ్వర బాబు, మానిటరింగ్ కమిటీ మెంబర్ మెండు రాజమల్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, మున్సిపల్ అధికారి, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.