పాలమూరులో బ్రహ్మోత్సవాలకు వేళ అయ్యింది. మహబూబ్ నగర్ జిల్లా మన్యం కొండ, జోగులాంబ గద్వాల్ జిల్లా జమ్ములమ్మ, నారాయణ పేట జిల్లా లింగంపల్లి, ఎలమ్మ బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఆలయ కమిటీల వారు ఏర్పాటులన్నీ పూర్తి చేసారు. పేదల తిరుపతిగా పేరుగాంచిన లక్ష్మివెంటేశ్వరస్వామి మన్యంకొండ ఆలయ అలంకారణకు సర్వం సిద్ధం చేశారు.