ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొండమల్లేపల్లి జెడ్పిహెచ్ఎస్ విద్యార్థులకు స్నాక్స్ అందజేత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 01:49 PM

కొండమల్లేపల్లి మండల ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి జడ్. పి. హెచ్. ఎస్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు సాయంత్రం స్టడీ అవర్లో స్నాక్స్ ఏర్పాటు చేయాలని తన దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించారు. సోమవారం రోజు విద్యార్థులకు స్నాక్స్ అందించడం జరిగింది. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ 10 తరగతి బోర్డు పరీక్షలో విద్యార్థులు అందరూ కష్టపడి మంచి మార్కులు తెచ్చుకోవాలని వారు తెలిపారు. నేటి నుంచి 10 తరగతి విద్యార్థులకు రెండు నెలల పాటు స్నాక్స్ అందజేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సత్యనారాయణ, ఎంపీటీసీ రాణి రాజు నాయక్, మంగ్యా నాయక్, ఉపాధ్యాయులు లోక్య నాయక్, నర్సింహ మహేందర్, సేవ నాయక్ కార్తీక్, అంజి, నాగేంద్ర తదితరలు పాల్గోన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com