రాష్ట్ర ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ను మాజీ ఎంపీపీ తొగరి సుదర్శన్ సోమవారం కలిసారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆయనను కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. ఫిబ్రవరి 12న తన కొడుకు వివాహానికి హాజరు కావాలని ఈ సందర్భంగా సుదర్శన్ ఎమ్మెల్యేను కోరుతూ ఆహ్వాన పత్రిక అందజేశారు. రామాయంపేట పట్టణంలోని బాలాజీ కళ్యాణ మండపంలో వివాహం జరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోవర్ధన్ కు తెలియజేశారు. కుటుంబ సమేతంగా వివాహానికి హాజరు కావాలని కోరారు. ఆయన వెంట భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు నిట్టూ వేణుగోపాలరావు, కామారెడ్డి పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, కాచాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భూపతి, వార్డు సభ్యులు మురళి, నాయకులు రాజిరెడ్డి ఉన్నారు.