పెద్దపల్లి నియోజకవర్గం ఓదెల మండలం పొత్క పల్లి గ్రామంలో మంగళవారం పౌరహక్కుల దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేందర్ గ్రామంలో కులవివక్ష, రెండు గ్లాసుల విధానంపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ రాజేందర్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు శనిగరపు రమేష్, రాములు, రాంచందర్, శంకర్, సారయ్య, రాజయ్య, అంబాల పోచయ్య, గడ్డం కొమురయ్య, ఓదెలు, సలిగంటి వెంకటేష్, చెరుకు శేఖర్, మధు, మల్లయ్య, రాజు, రాజేశం, పాల్గొన్నారు.