కోటపల్లి మండలంలోని బొప్పారం గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మంత్రి సురేఖ మాట్లాడుతూ దళిత వర్గాలు పౌర చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. పట్టా కలిగి ఉన్న పోడు భూముల్లో అటవీశాఖ అధికారులు సాగు చేయనీయడం లేదని పలువురు తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంచిర్యాల జిల్లా అట్రాసిటీ ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ సభ్యులు వెంకటేష్ మాట్లాడుతూ కలెక్టర్, అటవీశాఖ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.