బెల్లంపల్లిలోని శాంతిఖని గని ఆవరణలో మెదక్ లో జరిగిన జాతీయ అథ్లెటిక్ పోటీల్లో త్రిబుల్ జంప్ లో గోల్డ్ మెడల్ సాధించిన ఫక్రుల్ హుడా, 100 మీటర్లు, 5 కి. మి పరుగుపందెంలో సిల్వర్ మెడల్ సాధించిన ఎం. కిషన్ ను మంగళవారం సింగరేణి అధికారులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా, రక్షణ అధికారి పి. రాజు, బీఎం ఇంచార్జి ముస్తఫా, వెంటిలేషన్ అధికారి పూర్ణ చందర్, ఇంజనీర్లు సైదులు, రాంసాగర్, ప్రవీణ్, టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్, ఏఐటీయూసి పిట్ కార్యదర్శి తిరుపతి గౌడ్ మరియు గని ఉద్యోగులు పాల్గొన్నారు.