సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పోలీస్ డివిజన్ల విభజన ప్రక్రియలో రోజురోజుకూ మార్పులు. చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణా రాష్ట్రం వచ్చాక జిల్లాల పునర్విభజనలొ భగంగా షాద్ నగర్ నియోజక వర్గం మహబూబ్ నగర్ జిల్లా నుంచీ రంగారెడ్ది జిల్లాలో చేరింది. అత్యంత కీలకమైన పోలీస్ శాఖను అప్పట్లో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కలిపారు. శంషాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డివిజన్లో ప్రస్తుతం కొనసాగుతోంది.
అయితే ఇప్పుడు మరికొన్ని సమూల మార్పులు జరుగుతుండడంతో ఈ నియోజకవర్గంలో ఉన్న మరో రెండు పోలీస్ స్టేషన్లు శంషాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పరిధిలో చేరబోతున్నాయని సమాచారం వ్యక్తం అవుతుంది. అయితే శంషాబాద్ జోన్లోకి అప్పట్లో మహబూబ్నగర్ జిల్లాకు చెందిన షాద్నగర్ డివిజన్ వచ్చి చేరింది. షాద్నగర్, కొందుర్గు, కేశంపేట్, కొత్తూరు, నందిగామ, చౌదరి గూడ ఠాణాలు ఈ డివిజన్ పరిధిలో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా శంషాబాద్ జోన్లోని షాద్ నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ పోలీస్ స్టేషన్లను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏసిపి శంషాబాద్ పరిధిలో కలిపే యోచనలో ఉన్నట్లు సమాచారం అందుతుంది.
పరిపాలన సౌలభ్యం కోసం పోలీస్ జోన్లలో మార్పులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే రాజేంద్రనగర్ ప్రాంతం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పరిధిగా మారుతుండడంతో శంషాబాద్ కు కేవలం కొన్ని ప్రాంతాలు మాత్రమె ఉన్నాయి. దీంతో కొత్తూరు, నందిగామ పోలీస్ స్టేషన్లను శంషాబాద్ ఏసిపి పరిధిలోకి చేర్చితే సౌలభ్యంగా ఉంటుందనే యోచనలొ పోలీస్ శాఖ అధికారులు ఉన్నట్లు సమాచారం. ఇదే గనక జరిగితే షాద్ నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం నుండి ఈ రెండు పోలీస్ స్టేషన్లను మినహాయించాల్సి ఉంటుంది.
కొత్తూరు, నందిగామ ఈ రెండు పోలీస్ స్టేషనులకు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అధికారి శంషాబాద్ లో సేవలు అందుబాటులో ఉంటాయి. షాద్ నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పరిధిలో షాద్ నగర్, కేశంపేట, కోందుర్గు, చౌదరిగూడా పోలీస్ స్టేషన్లు మాత్రమే ఉంటాయి. ప్రభుత్వ, పోలీసు అధికారులు, ప్రజా ప్రతనిధులంతా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.