ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 03:01 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మంగళవారం సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని ఎస్సార్ నాయక్ నగర్ లోని పెద్దమ్మ పోచమ్మ తల్లి 18వ వార్షికోత్సవానికి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శైలంగౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలంతా సుబీక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బొబ్బ ప్రసాద్, బొబ్బ రంగారావు గోపాల్ రెడ్డి, ఏవి శేషాచారి, మల్లారెడ్డి బిజెపి నాయకులు ఎం.ఎస్ వాసు, కంది శ్రీరాములు, గుబ్బల లక్ష్మీనారాయణ, బీమరాజు, మాల్యాద్రి, పిన్నమనేని వెంకటేశ్వరరావు, కుమ్మరి శంకర్, గుబ్బల రమణ, ఏసుబాబు, సురేష్ నాయుడు, మల్లేష్ గౌడ్, వల్లూరి ప్రసాద్, చైతన్య లక్ష్మణ్, శ్రీనివాస్ గుప్త, కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com