ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధికారంలోకి వస్తే రైతు డిక్లరేషన్ ఆమలు; వంశీకృష్ణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 19, 2023, 10:13 AM

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, ఉప్పునుంతల మండలం పిరట్వాని పల్లి(అవులోని బాయి) గ్రామంలో 3వ రోజు హత్ సే హత్ జోడో అభియాన్ కార్యక్రమంలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకు గ్రామంలో పర్యటించారు. వరంగల్ రైతు డిక్లరేషన్, హత్ సే హత్ జోడో సందేశాన్ని ప్రజలకు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేసే అభివృద్ధి కార్యక్రమాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కట్ట, అనంత రెడ్డి , వంశీయువసేన అధ్యక్షుడు బిజ్జుల, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోగిలి మహేష్, రవీందర్, డిప్యూటీ సర్పంచ్ దాసు, చంద్రమౌళి, కృషయ్య, శివ, మరీయ్ కార్యకర్తలు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com