రైస్ మిల్లర్లకు కేటాయించిన ధాన్యాన్ని తప్పనిసరిగా రైస్ మిల్లుల వద్ద కొనుగోలు చేసి దించుకోవాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. గురువారం జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ వరి ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైస్ మిల్లర్లు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా రైతుల వద్ద వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టేలా తహసిల్దార్ లు చర్యలు తీసుకోవాలన్నారు.