కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని వెన్నెల గడ్డ, బౌద్ధ నగర్ లలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తూ పూర్తిచేసిన పలు అభివృద్ధి పనులు పరిశీలించారు. కాగా తమ బస్తీలు, కాలనీలో మెరుగైన సౌకర్యాల కల్పనకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించినందుకు ఎమ్మెల్యే కి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంచినీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, అక్కడక్కడా మిగిలి ఉన్న భూగర్భడ్రైనేజీ, సీసీ రోడ్ల ఏర్పాటు, పార్క్ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే ని కోరగా. అక్కడే ఉన్న అధికారులకు ఆదేశించారు. త్వరలోనే వాటిని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సంపత్ మాధవరెడ్డి, కుంట సిద్ధిరాములు, గుమ్మడి మధుసుధన్ రాజు, జ్ఞానేశ్వర్, వార్డు సభ్యులు సుధాకర్ గౌడ్, ఇందిరా రెడ్డి, కాలే నాగేష్, సమ్మయ్య, బాలమల్లేష్, భిక్షపతి, రవి, యాదగిరి, సుబ్బారావు, మధుకృష్ణ, ముత్యం రెడ్డి, చక్రవర్తి, వెంకటేశ్వర రావు, శ్రీకాంత్, కాలే గణేష్, నగేష్ రెడ్డి, నదీమ్ రాయ్, విజయ్ హరీష్, దుర్గా ప్రసాద్, శివ, సంజు, వినీత్, సంతోష్, కునాల్, యాదగిరి, అరుణ్, సన్ని, సాయి, కిషోర్, రాహుల్, దత్తు, పింటు, యేసు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |