మిర్యాలగూడ పట్టణంలో 28వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ యాదవ్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.