మెదక్ జిల్లా టేక్మాల్ మండలం తంపులూరులో దుబ్బగళ్ల సంగమ్మను వరసకు అల్లుడు హత్య చేసినట్లు అల్లాదుర్గం సీఐ రేణుక రెడ్డి, ఎస్సై మురళి తెలిపారు.
ఈ నెల 20న సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం మర్వెల్లికి చెందిన మల్లగుల్ల యేసు ఆమె ఇంటికి వచ్చాడు. రాత్రి ఆస్తి కోసం సంగమ్మను యేసు హత్య చేసి, ఆభరణాలు తీసుకొని పారిపోయినట్లు వివరించారు. ఈరోజు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు.