తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఇంటర్ కాలేజీలకు ఈ విద్యా సంవత్సరంలో మార్చి 30ని చివరి పనిదినంగా ప్రకటించారు. ఇంటర్ కాలేజీలకు మార్చి 31 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది.ఈ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.