ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని పోసన్ పల్లి గేట్ వద్ద గురువారం ఆగివున్న బస్సును వెనుక నుండి వచ్చిన కారు ఢీకొట్టింది. ఆ సమయంలో గేట్ వద్ద ఎవ్వరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సును ఢీకొన్న కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. కారు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఆ కారు జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించిన కారు అని కారు వెనుక ఉన్న ఎన్నికల పోస్టర్ ను బట్టి తెలుస్తుంది.