ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ మార్గంలో జర్నీ చేసేవారికి టీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 25, 2024, 07:50 PM

హైదరాబాద్-బెంగళూరు మార్గంలో వెళ్లే బస్సుల్లో వెళ్లే వారికి టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆ మార్గంలో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు తిరుగు ప్రయణంపై 10 శాతం రాయితీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లే అన్ని హైఎండ్ సర్వీసుల్లోనూ ఈ రాయితీ వర్తిస్తుందని సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ రూట్లలో వెళ్లే ప్రయాణికులు 10 శాతం రాయితీని వినియోగించుకుని, టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.


ఇక క్రికెట్ అభిమానలకు కూడా టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య నేడు మ్యాచ్ జరగనుంది. మ్యాచ్‌ను వీక్షించేందుకు ఉప్పల్ స్టేడియానికి చేరుకోవటానికి బస్సులు ఏర్పాటు చేసింది. 'మీకోసమే హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి క్రికెట్ స్టేడియానికి 60 ప్రత్యేక బస్సులను సంస్థ ఏర్పాటు చేసింది. ఆర్టీసీ బస్సుల్లో వెళ్తే ట్రాఫిక్ తిప్పలు ఉండవు. సొంత వాహనాల్లో వెళ్తే పార్కింగ్ ఇబ్బందులుంటాయి. కావున ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించండి. క్షేమంగా స్టేడియానికి చేరుకుని మ్యాచ్‌ని వీక్షించండి.' అని సజ్జనార్ ట్వీట్ చేశారు.


ఇక ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ కోసం హైదరాబాద్ మెట్రో కూడా ట్రైన్ సేవల్ని పొడిగించింది. మ్యాచ్ జరిగే రూట్‌లో అర్ధరాత్రి వరకు సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పింది. క్రికెట్ ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని హైదరాబాద్ మెట్రో ప్రకటన రిలీజ్ చేసింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com