హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్న్యూస్. ఈనెల 25 మెట్రో సేవల్ని పొడగిస్తున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో మెట్రో సేవలు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. మ్యాచ్ రోజున రాత్రి ఒంటిగంట వరకు మెట్రో సేవలు ఉంటాయని వెల్లడించారు. రాత్రి 12:15 గంటలకు చివరి ట్రైన్ ప్రారంభమై.. 1:10 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని చెప్పారు. అయితే ఉప్పల్ స్టేడియం - ఎన్జీఆర్ఐ స్టేషన్లలో మాత్రమే ప్రవేశానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. ఉప్పల్ మార్గంలోని మిగతా స్టేషన్లలో ట్రైన్ దిగే వారికే అనుమతి ఉంటుందని.. ఎక్కడానికి వీలుండదని స్పష్టం చేశారు.
కాగా, ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు రెండోసారి తలపడుతోంది. తొలిసారి మ్యాచ్లో ఆర్సీబీపై హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్.. చెబితే ప్రత్యర్థుల టీంలకు కాస్తంత వణుకు పుడుతుందనే చెప్పాలి. అంత విధ్వంసకరంగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కడా లేని రికార్డులను తిరగ రాస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలోనే మూడు సార్లు 250కి పైగా స్కోర్ చేసిన మొదటి టీం సన్ రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. ప్రస్తుత సీజన్లో అంచనాలకు అందకుండా చెలరేగిపోతున్నారు. ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడి ఐదింట్లో విజయం సాధించింది. ఆర్సీబీతో జరిగే మ్యాచ్ లో ఇదే ఫామ్ కొనసాగించాలని భావిస్తోంది.