లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంకు సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే. పీ. నడ్డా రానున్నారని మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి వెల్లడించారు. ఖమ్మంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. కొత్తగూడెంలో జేపీ నడ్డా పాల్గొననున్న ప్రచార సభకు పార్టీ శ్రేణులు తరలిరావాలని కోరారు. మోదీ నేతృత్వాన అమలవుతున్న సంక్షేమ పథకాలే బీజేపీని మరోమారు గెలిపిస్తాయని తెలిపారు.