ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశాలమేరకు నూతన కమిటీ నిర్మాణంలో భాగంగా శనివారం జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన నక్క రమేష్ ను జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించి నియామకపత్రం అందించడం జరిగిందని జిల్లా అధ్యక్షుడు సురుగు శ్రీనుజగన్, దుమాల గంగారాం లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ కన్వీనర్ నక్క సతీష్, కో కన్వీనర్ పోడేటి సునీల్, సంగేపు ముత్యం, బెజ్జంకి సతీష్ పాల్గొన్నారు.