మండలంలోని కోరుకొండ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మేఘ్య తండాకు చెందిన లకావత్ మౌనిక శనివారం పిడుగుపాటుతో అక్కడికక్కడే మరణించింది. ఇట్టి వార్తను తెలుసుకున్న మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పొరిక బలరాం నాయక్ ఈరోజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిచి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు, వారి వెంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరావు, పీసీసీ సభ్యులు దస్రు నాయక్, సీనియర్ నాయకులు బండారు దయాకర్ , మార్కెట్ కమిటీ డైరెక్టర్ వసంతరావు, రావుల మురళి, వేముల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు