కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన బత్తిని సాయి, ఏనుగుల ఐలయ్య ఇటీవల చనిపోగా, ముదిరాజ్ యువసేన సభ్యులు మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం అందజేశారు.
ఈ సందర్భంగా ముదిరాజ్ యువసేన యూత్ అధ్యక్షుడు మామిడి శ్రీనివాస్ మట్లాడుతూ, మల్లాపూర్ గ్రామస్తులకు ఆపత్కాలంలో అండగా ఉంటామని భరోసా కల్పించారు. డైరెక్టర్లు గాండ్ల కుమారస్వామి, పల్లె సాయి, మారుతి సంఘ సభ్యులు మామిడి భిక్షపతి, మామిడి అనిల్, పాశం అనిల్, మామిడి వంశీ, పాశం సంతోష్, బోళ్ల అంజి తదితరులు ఉన్నారు.