ఆటో కార్మికులకు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఇన్సూరెన్స్ ధరలు తగ్గించాలని, ప్రభుత్వ పథకాలను ఆటో కార్మికులకు ప్రత్యేకంగా అమలు చేయాలని కోరుతూ ఐఎన్టీయూసీ ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ విప్లవ కుమార్ పటేల్ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం ఎంపీ రామసహయం రఘురామరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుక్కల రామకృష్ణ, నగర అధ్యక్షులు ప్రసాద్ తదితరులు ఉన్నారు.