చింతపల్లి మండలం లో వివిధ పాఠశాలల లో డి ఎ,పి ఆర్ సి,పెండింగ్ బిల్లుల తక్షణ పరిష్కారం కోరుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపుమేరకు జడ్పిహెచ్ఎస్ వెంకటేశ్వర్ నగర్ జెడ్పిహెచ్ఎస్ చింతపల్లి జెడ్పిహెచ్ఎస్ గడియ గౌరారం మరియు యుపిఎస్ నెల్వల పల్లి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను తెలియజేశారు.
ఈ సందర్భంగా తపస్ చింతపల్లి మండల అధ్యక్షుడు సొనగంటి వేణుగోపాల్ ప్రధాన కార్యదర్శి శివకోటి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించవలసిన ఐదు డిఏలు, ఏరియర్స్ పెండింగ్ బిల్లులు మెడికల్ బిల్లులు వెంటనే చెల్లించాలని మరియు పి ఆర్ సి ని తక్షణమే అమలుచేయాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో,తపస్ నాయకులు వినోద్,నెలంటి వెంకటేశ్వర్లు పెద్ద ఎత్తున ఆయా పాఠశాలల ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు పాల్గొనిసంఘీభావంప్రకటించారు.