దేవరకొండ నియోజకవర్గం పిఏ పల్లిమండలంలో నిర్మాణ దశలో ఉన్న ఏకే బిఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను ఇరిగేషన్ అధికారులతో ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ కలిసి పరిశీలించారు ఏ కే బి ఆర్ ప్రాజెక్టు ను త్వరితగతిన పూర్తి చేయాలని ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.వచ్చే ఏడాది లోగా రైతులందరికీ సాగు నీరు అందించడమే లక్ష్యంగా పని చేయాలి అని అధికారులను ఆదేశించడంజరిగింది.కాంట్రాక్టర్లు కూడా ప్రాజెక్టు ను త్వరితగతిన పూర్తి చేయాలని అదేశించి అదేవిధంగా వారికి నిధుల కొరత లేకుండా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా మంత్రికోమటి రెడ్డి వెంకట్ రెడ్డి , నల్గొండ పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి యొక్క సహకారం తో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ఏటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని కాంట్రాక్టర్లకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్,దేవరకొండ మర్కెట్ చైర్మన్ నాయిని జమున మాధవ రెడ్డి, పిఏసియస్ చైర్మన్ తెర మణిపాల్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు ఎల్లయ్య యాదవ్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కల గోవర్దన్ రెడ్డి,సింగల్ విండో వైస్ చైర్మన్ నీలం శ్రీనివాస్,మాజి ఎంపీపీ తెర సత్యనారాయణ రెడ్డి,కసిరెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బోడ్య నాయక్,ముచ్చర్ల కొండల్ యాదవ్ అధికారులు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.