రేవంత్ రెడ్డి దృష్టిలో డబుల్ ఇంజిన్ అంటే మోదీ, అదానీ అని కేటీఆర్ విమర్శించారు. అందుకే వాళ్లిద్దరికీ కావాల్సిన పనులను చక్కబెడుతూ వారి చల్లని చూపు తనపై ఉండేలా చూసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని ఆదేశానుసారమే రేవంత్ నడుచుకుంటున్నారని ఆరోపించారు. బడే భాయ్ ఆజ్ఞలను ముఖ్యమంత్రి తూచా తప్పకుండా పాటిస్తున్నారని, అదాని సంతృప్తి కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.అదానికి మేలు చేసేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని ధ్వజమెత్తారు. అందుకే ముఖ్యమంత్రి దుర్మార్గాలపై బీజేపీ మౌనంగా ఉంటుందని ఆరోపించారు. మూసీ దిగువన రామన్నపేటలో అంబుజా సిమెంట్ ప్లాంట్ కోసం బూటకపు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.