జాగృతి పోలీస్ కళాబృందం వరంగల్ నగర పోలీస్ కమీషనర్ కిషోర్ జా ఐపీఎస్ ఆదేశాల అను సారం నర్సంపేట పట్టణంలో సిఐ రమణమూర్తి మరియు ఎస్సై అరుణ్ కుమార్ ల ఆధ్వర్యంలో పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాల ఫ్లాగ్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది సందర్భంగా..నర్సంపేట పట్టణం బస్టాండ్ ఆవరణం లో మంగళ వారం సాయంత్రము 5:00 గంటల నుండి 6:30గంటల వరకు అమర పోలీసులను స్మరించుకుంటు, పాటల పాడుతూ,స్లోగన్ ఇస్తు, ప్రజలకి పోలీస్ యొక్క గొప్ప తనాలను వారు చేసిన త్యాగాలను ప్రజలకు తెలియ జేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నర్సంపేట సీఐ రమణమూర్తి మాట్లాడుతూ..ప్రతి పోలీస్ మీకోసం మీ కుటుంబాల రక్షణ కోసం సమాజాల బాగు కోసం, అనుక్షణం రక్షకుడిగా కాపు కాస్తూ ఉంటాడని అలా కాపు కాసే పోలీసు ఎంతోమంది అమరులు అయినారని వారందరినీ ఈ సందర్భంగా స్మరించుకొవడం మన బాధ్యతని తెలియజేశారు, అనంతరం.ఎస్సై అరుణ్ కుమార్ మాట్లాడుతూ..ప్రజలు కొరకు పోలీస్ సమాజంలో రాత్రనక పగలనక లా అండ్ ఆర్డర్ ని కాపాడుతూ ప్రజా జీవనానికి ఎటువంటి ఆటంకం కలగకుండా అను నిత్యం తపించే నిజమైన రక్షకుడు పోలీస్ అని అలాంటి పోలీసులు ఎందరో వీర మరణం పొంది చరిత్రలో నిలిచారని వారిని తలచుకోవడం కనీసం మన బాధ్యతని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ ఆఫీసర్స్, కానిస్టేబుల్ ఆఫీసర్స్,మరియు ప్రయాణికులు 250 మంది పాల్గోన్నారు.