ఒకే పోలీసు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్ పోలీసులు ఆందోళనకు దిగారు. నిరసన కార్యక్రమాల్లో కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.వరంగల్ జిల్లాలోని మామునూరులో 4వ బెటాలియన్ కానిస్టేబుళ్లు ఆందోళన చేపట్టారు. మామునూరు బెటాలియన్ కమాండెంట్ ఆఫీస్ వద్ద బైఠాయించి నిరసనకు దిగారు.ఆందోళనల నేపథ్యంలో నల్గొండ గ్రామీణ ఎస్ఐ సైదాబాబుకు నిరసన సెగ తగిలింది. ఎస్ఐ గోబ్యాక్ అంటూ 12వ బెటాలియన్ కానిస్టేబుళ్లు నినాదాలు చేశారు. పోలీసుల కుటుంబసభ్యులపై సైదాబాబు దురుసుగా ప్రవర్తించారని నిరసనకు దిగారు.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులు నిరసనకు దిగారు. సాగర్ రోడ్డుపై ధర్నా చేపట్టారు.