మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.మానకొండూర్ మండలం అన్నారంలోని ఊర చెరువులో శుక్రవారం ఉచిత చేపపిల్లలను వదిలారు.ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ..మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం వంద శాతం సబ్సిడీపై ఉచితంగా చేప పిల్లలను అందిస్తున్నదని తెలిపారు.ప్రభుత్వం.
ఉచితంగా అందించే చేప పిల్లలను చెరువులు,కుంటల్లో పెంపకం చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు,వైస్ చైర్మన్ రామిడి తిరుమల్ రెడ్డి,మత్స్య శాఖ ఏడి విజయభారతి,మత్స్య శాఖ అభివృద్ధి అధికారి మంజుల,మత్స్యపారిశ్రామిక సహకార సంఘం జిల్లా డైరెక్టర్,అన్నారం సోసైటీ అధ్యక్షుడు పప్పు సమ్మయ్య,కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సంపత్ గౌడ్,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నందగిరి రవి,సోసైటీ వైస్ చైర్మన్ కొలిపాక కొమురెల్లి,ప్రధాన కార్యదర్శి కొలిపాక ప్రవీణ్,ఏఎంసి డైరెక్టర్ రేమిడి శ్రీనివాస్ రెడ్డి,మీస సత్యనారాయణ,గోపు రవీందర్ రెడ్డి,రామాంజనేయులు,మడుపు ప్రేమ్ కుమార్,బుర్ర శ్రీధర్ గౌడ్,సహదేవ్,కొట్టె అంజిరెడ్డి,పప్పు ఓదెలు,పప్పు సమ్మయ్య,రేగుల కుమారస్వామి,పప్పు రమేష్,పూసాల మల్లేశం,అనవేని రమేష్,రామగిరి సంతోష్,ముక్కెర సతీష్ పాల్గొన్నారు.