మూడో విడత హరితహారానికి సర్వం సిద్ధమైంది. కరీంనగర్ వేదికగా సీఎం కేసీఆర్.. ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. బైపాస్ రోడ్ లోని ఎల్ఎండీ కట్ట దిగువన మహాఘని మొక్కను నాటి మూడో విడత హరితహారానికి సీఎం కేసీఆర్ అంకురార్పణ చేయనున్నారు. ఇందుకోసం ఎల్ఎండీ ఆనకట్ట దిగువ ప్రాంతాన్ని అధికారులు సర్వంగా సుందరంగా ముస్తాబుచేశారు. కట్ట పరిసరాల్లో 25 వేల మొక్కలు నాటేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో నగరంలోని 50 డివిజన్ లలో 25 వేల మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.