చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది. అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి తొలి వర్దంతిని డిసెంబర్ 5వ తేదీ నిర్వహించకుండా స్టే విధించాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి అమ్మ జయలలిత తొలి వర్ధంతిని ప్రభుత్వం నిర్వహించకుండా స్టే విధించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో ప్రముఖ న్యాయవాది దురైస్వామి పిటిషన్ దాఖలు చేశారు.జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నపుడు ఆమె మరణించినట్టు డిసెంబర్ 5వ తేదీన రెండుసార్లు వేర్వురు సమయాల్లో ప్రకటించారని న్యాయవాది దురైస్వామి గుర్తు చేశారు.పిటిషన్ ను శుక్రవారం విచారణ జరుపుతామని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు శివజ్ఞానం, జస్టిస్ సుందర్ తెలిపారు. మద్రాసు హైకోర్టుకు ఏం సమాధానం చెప్పాలి అంటూ తమిళనాడు ప్రభుత్వం ఆలోచనలో పడింది.