హైదరాబాద్: మెట్రో సేవలు బుధవారం ఉదయం నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మెట్రో రైలు పట్టాలపైకి పరుగులు పెట్టనుంది. నిన్న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైన మెట్రోకు తొలి ప్రయాణికుడు కూడా ఆయనే. కాగా ఈరోజు మెట్రోలో మొదటగా ప్రయాణిస్తున్న వ్యక్తికి బహుమతిని ఇవ్వనున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. మరోవైపు తొలిరోజు మెట్రోలో ప్రయాణించేందుకు నగర వాసులు ఉత్సాహం చూపుతున్నారు. అటు నాగోల్-మియాపూర్ కారిడార్లో మెట్రో పరుగులు పెట్టనుంది. నాగోల్-మియాపూర్ మధ్య 30 కి.మీల దూరంలో 24 స్టేష్లన్లు ఏర్పాటు చేశారు. ప్రయాణికులు కేవలం 42 నిమిషాల్లో నాగోల్ నుంచి మియాపూర్కు చేరుకోవచ్చు. మెట్రో టికెట్ కనిష్ట ధర రూ.10, గరిష్ట టికెట్ ధర రూ.60గా నిర్ణయించారు. అలాగే గూగుల్ ప్లే స్టోర్లో మెట్రో మొబైల్ యాప్ ఆవిష్కరించారు.