హైదరాబాద్ : చందానగర్లోని వేమకుంటలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో 3 మృతదేహాలు ఉన్నట్లుగా సమాచారం. అపార్ట్మెంట్లో అనుమానాస్పద స్థితిలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. మృతి చెందిన వారు అపర్ణ, ఆమె తల్లి, కుమార్తెలుగా పోలీసులు గుర్తించారు. అపర్ణ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తుంటుంది. ఎటువంటి సమాచారం లేకుండా ఆమె విధులకు రాకపోవడంతో తోటి సిబ్బంది అపర్ణ ఇంటికి వచ్చారు. ఎంతసేపటికి అపర్ణ తలుపులు తీయకపోవడంతో కిటికీలోంచి ఇంటిలోకి చూసిన సిబ్బంది ఆమె చనిపోయినట్లుగా గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా వారు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.