వనపర్తి జిల్లాలో నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు పర్యటిస్తున్నారు. పెద్దమందడి మండలంలోని వెల్దూర్, వనపర్తి మండలం చిట్యాలల్లో నూతనంగా నిర్మించిన మార్కెట్ గోదాములను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చిన్నారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, మార్కెటింగ్ శాఖ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అనంతరం బుద్దారం పెద్ద చెరువు నుంచి పెద్దమందడి మండలంలోని 20 గ్రామాలకు పైగా ఎంజీకేఎల్ఐ ద్వారా సాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్న కాలువకు శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపన అనంతరం నిర్వహించే బహిరంగసభలో మంత్రి పాల్గొంటారు.