నల్లగొండ జిల్లాలోని నార్కెట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడ వద్ద అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతుని వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.