నల్లగొండ జిల్లాలోని చిట్యాల మండలం తాళ్లవెల్లముల గ్రామంలో దుండగులు కందులను దోచుకెళ్లారు. చెన్నులు అనే రైతు తాను పండించిన కందిపంటకు కాపలాగా వెళ్లాడు. అర్థరాత్రి నలుగురు దొంగలు చెన్నులును డ్రిప్ పైపుతో మంచానికి కట్టేసి కొంత కందులను దోచుకెళ్లారు. మిగిలిన కుప్పకు దుండగులు నిప్పు పెట్టారు. ఆ నిప్పుతో డ్రిప్ పైపు అంటుకుని మంచానికి కూడా మంట అంటుకుంది. స్వల్ప గాయలతో విడిపించుకున్న చెన్నులు విషయాన్ని గ్రామంలోకి వెళ్లి చెప్పాడు. గ్రామస్తుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దుండగులు దోచుకెళ్లిన, కాలిపోయిన కందుల విలువ రూ.60వేల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.