హదరాబాద్, సూర్యప్రధానప్రతినిధిః ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు మైనంపల్లి హనుమంతరావు, ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్గౌడ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీరికి ఎన్నిక ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్సీలుగా ఎన్నికైన అభ్యర్థులు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీగా అవకాశమిచ్చిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తమని పేర్కొన్నారు.