హైదరాబాద్,మేజర్న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరు పాడు మండలం రామకృష్ణాపురం సమీపంలో తాటిచెట్టు పడి మహిళా కూలి మృతిచెందింది. పిడుగు పడటంతో తాటిచెట్టు కూలింది. కాగా సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మం డలం లక్ష్మీపూర్ గ్రామ శివారులో గుర్తు తెలియని యువ కుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వివరాలు తెలి యాల్సి ఉంది. మరో ఘటనలో యాద్రాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ప్రొద్దుటూరులో తేనేటీగల దాడిలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. మరో ఇద్దరు వ్యక్తు లు గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లాలోని రాజేందన్రగర్ అత్తాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలుడిని ఓ వాటర్ ట్యాంకర్ ఢీకొంది. ఈ దుర్ఘటనలో టింకు అనే ఏడేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. బాలుడి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఖమ్మం జిల్లాలోని ముది గొండ మండలం గోకినపల్లి వద్ద రోడ్డు ప్రమాదం సంభవి ంచింది. లారీ-ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో 16 మంది కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.