శివరాత్రి సందర్భంగా కీసరగుట్టలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర్ రావు వెల్లడించారు. సుమారు 1000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. మల్కాజిగిరి డీసీపీ మీడియా సమావేశంలో కీసరగుట్టకు వచ్చే భక్తులకు పలు సూచనలు చేశారు. భక్తులు వారికి కేటాయించిన పార్కింగ్ స్థలంలో వాహనాలు నిలిపి శ్రీ భవానీరామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని సూచించారు. బీడీలు, సిగరెట్లు, పొగతాగడం, మద్యం, మాంసం కీసరగుట్టపై నిషేదించామని, భక్తులు పోలీసులకు సహకరించాలని డీసీపీ కోరారు.