హైదరాబాద్: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల లెక్కింపు పూర్తైంది. హన్మకొండ టీటీడీ కల్యాణ మండలంలో గత వారం రోజుల నుంచి కొనసాగిన లెక్కింపు నేటితో ముగిసింది. మొత్తం 479 హుండీల లెక్కింపు పూర్తి అయింది. హుండీల ఆదాయం రూ. 10 కోట్ల 17 లక్షల, 50 వేల 363. అదేవిధంగా 824 గ్రాముల బంగారం, 47 కిలోల వెండిని భక్తులు కానుకల రూపంలో సమర్పించారు.